భారతీయ కళా మహోత్సవ్ రెండవ ఎడిషన్ హైదరాబాద్ రాష్ట్రపతి భవన్లో వైభవంగా ప్రారంభమైందని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తెలిపారు. ఉత్తర భారతదేశ కళా సంస్కృతిని ఈ వేడుకల్లో ప్రదర్శించి దేశ సాంస్కృతిక కళా విశిష్టతను చాటు చెప్పనున్నారని వెల్లడించారు. భారతదేశం కళా సాంప్రదాయానికి నిలయమని ఆ కలలను కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని స్పష్టం చేశారు.
భావితరాలకు ఈ కళా సంపదను అందించి కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. ఈ వేడుకల్లో గోవా, రాజస్థాన్, తెలంగాణ గవర్నర్, కేంద్ర సాంస్కృతిక మంత్రి, బొగ్గు గనుల మంత్రి, గిరిజన సంక్షేమ మంత్రి కిషన్ రెడ్డి, గుజరాత్, తెలంగాణ మహిళా శిశు సంక్షేమ మంత్రి అనసూయ తదితరులు పాల్గొన్నారు.

