వేములవాడ:పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములవాడ రూరల్ మండల పరిధిలో అర్హులైన 10 మంది లబ్ధిదారులకు రూ.3.48 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆది శ్రీనివాస్ శనివారం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు,రూరల్ అధ్యక్షులు వకులాభరణం, శ్రీనివాస్,వేములవాడ మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్,రోమలా ప్రవీణ్,గుడిసె శంకర్ పాల్గొన్నారు

