రాజన్న సిరిసిల్ల జిల్లా:మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు ఇచ్చారు. ఇందిరా మహిళా శక్తి కింద 8871 ఎస్ హెచ్ జీలకు రూ.8 కోట్ల 12 లక్షల చెక్కులను వేములవాడ పట్టణంలోని ఫంక్షన్ హాల్, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి పంపిణీ చేశారు.

