Tuesday, July 21, 2026
Homeరాజకీయాలురైతు ఐలయ్యకు రసమయి పరామర్శ

రైతు ఐలయ్యకు రసమయి పరామర్శ

TG: బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన రైతు బండి ఐలయ్య కు చెందిన పత్తి పంట ఇటీవల ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. దీంతో సుమారు 350 క్వింటాళ్ల పత్తి కాలిపోయి రైతుకు భారీ నష్టం వాటిల్లింది.

ఈ విషయం తెలిసి మానకొండూర్‌ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ బాధిత రైతు కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు. రసమయి మాట్లాడుతూ రైతు ఐలయ్యకు దాదాపు రూ.30 లక్షల దాకా నష్టం జరిగిందని, తక్షణమే అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని కోరారు.

Related News

తాజా వార్తలు