TG: హైద్రాబాద్కు చెందిన యువ షూటింగ్ క్రీడా కారిణి ఈషా సింగ్ను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం సన్మానించారు.
హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల ఈజిప్టులో నిర్వహించిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ మహిళల 25 మీటర్ల ఫిస్టల్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ సాధించి ఈషా సింగ్ దేశానికి చారిత్రాత్మక విజయం అందించింది.

