పెద్దపల్లి:గత సంవత్సరకాలం నుండి ఎంపీ వంశీకృష్ణ కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తో జరిపిన చర్చల ఫలితాల వలన కేంద్ర ప్రభుత్వం ఆస్పత్రి నిర్మాణానికి స్థలాన్ని కేటాయించింది.
ఈ క్రమంలో ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని పరిశీలించేందుకు ఎంపీ వంశీకృష్ణ వచ్చారు.
అయితే అధికారులు ఆసుపత్రి స్థలంలో ఎలాంటి ఏర్పాటు చేయలేదు.దీంతో అధికారుల తీరుపై ఎంపీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఎంపీని అధికారులు అవమానపరిచారని ఆరోపిస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ తో పాటు, ఈఎస్ఐ అధికారులకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన కార్మికుల సౌకర్యం ఆసుపత్రిని తీసుకువస్తానని వంశీకృష్ణ తెలిపారు.

