TG:రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ను పట్టనంలోని ఆయన నివాసంలో మాజీ ఎంపీపీ రంగ వెంకటేష్, పలువురు కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా నియామకమైనందున శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.
ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలోనే 35 సంవత్సరాల నుండి కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనను జిల్లా అధ్యక్షునిగా నియమించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

