IPL 2026కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో KKR సంచలన నిర్ణయం తీసుకుంది. విధ్వంసకర ఆటగాడు ఆండ్రీ రస్సెల్ ను వేలంలో వదిలేసింది. 2014 ఐపీఎల్ సమయంలో KKR జట్టులోకి వచ్చిన ఆండ్రీ రస్సెల్.. జట్టుకు 11 సంవత్సరాల పాటు సేవలు అందించాడు. అనేక విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడాడు.
ఇక ఇప్పుడు వేలంలోకి వచ్చాడు ఆండ్రీ రస్సెల్. దీంతో ఈ మినీ వేలంలో ఆండ్రీ రస్సెల్ ను ఎలాగైనా కొనుగోలు చేసేందుకు RCB జట్టు సిద్ధమవుతోందట. ఏకంగా రూ.12 కోట్లు పెట్టి మరీ, ఆండ్రీ రస్సెల్ ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మిడిలార్డర్ ను మెరుగుపరుచుకునేందుకు RCB ఈ స్కెచ్ వేసిందట.

