TG: పేదల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుబ్బాక నియోజకవర్గానికి చెందిన 141మంది లబ్దిదారులకు CMRF చెక్కులను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఆపన్న హస్తం CMRF సహాయనిధి పని చేస్తుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

