TG: జమ్మికుంట పట్టణంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు వెంటనే చికిత్స కోసం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మధ్యాహ్న భోజనంలో గుడ్లు వాసన వచ్చాయని అన్నంలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు ఆరోపించారు. అస్వస్థకు గురైన విద్యార్థులకు ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు.

